జైలు నుంచి బెయిల్ పై విడుదల అయిన నూతన్ నాయుడు
By: Sankar Wed, 18 Nov 2020 10:13 PM
శిరోముండనం కేసుతో పాటు పలు కేసుల్లో అరెస్టైన బిగ్బాస్ కంటెస్టెంట్, వ్యాపారవేత్త నూతన్నాయుడు సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చాడు. కోర్టు ఆదేశాలతో బెయిల్పై నూతన్ నాయుడును జైలు అధికారులు విడుదల చేశారు...కాగా ఏపీలో సంచలనం సృష్టించిన దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్ నాయుడు ఏ8గా ఉన్నాడు.
ఇక అతడు పారిపోతుండగా.. సెప్టెంబరు 3న బెంగుళూరు ఉడుపిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత నూతన్ నాయుడు మోనాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. శిరోముండనంతో పాటు ఉద్యోగాల పేరుతో మోసం చేయడం, ఉన్నతాధికారి పేరుతో పలువురికి కాల్స్ చేసినట్టు నూతన్ నాయుడు పై అభియోగాలు వచ్చాయి..
ఈ క్రమంలో అతడిపై 3 అట్రాసిటీ సహా 7 కేసులను పోలీసులు నమోదు చేశారు. పెందుర్తిలో 3 , గోపాలపట్నం, కంచరపాలెం, గాజువాక, మహారాణిపేట పీఎస్లలో ఒక్కో కేసు నమోదైంది. ఇక ఈ అన్ని కేసుల్లో నూతన్ నాయుడుకు బెయిల్ మంజూరైంది. కాగా దాదాపు 70 రోజుల పాటు నూతన్ నాయుడు జైల్లో ఉన్నాడు. మరోవైపు శిరోముండనం కేసులో నూతన్ నాయుడు భార్య సహా మిగిలిన ఏడుగురు ఆ మధ్యనే బయటికి వచ్చేశారు