పెళ్లి అయిన నెల రోజులకే తనువు చాలించిన నవ వధువు
By: Sankar Sat, 06 June 2020 6:46 PM
పెళ్లి జరిగి నెల రోజులు అయినా కాకముందే నవవధువు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషాద ఘటన వెలుగుచూసింది. పెళ్లికి ముందే మరో యువతితో ఆ సంబంధం పెట్టుకున్న భర్త.. ప్రియురాలితో నగ్నచిత్రాలు చూసి నవ వధువు అఘాయిత్యానికి పాల్పడింది. మోసపోయానన్న మనస్థాపంతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన మైసూరులో చోటుచేసుకుంది.
నగరంలోని ఆనంద నగర ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అజయ్కి భావనతో నెల రోజుల కిందట వివాహం జరిగింది. అత్తింటికి వచ్చిన కొద్ది రోజులకే భర్త బండారం బయటపడింది. పెళ్లికి ముందు నుంచే తన భర్తకి వేరొకరితో శారీరక సంబంధముందని తెలిసింది. ప్రియురాలితో ఏకాంతం లో దిగిన ఫొటోలను భర్త ఫోన్లో చూసి షాక్కి గురైంది.
అదే విషయాన్ని పెద్దల మధ్య పెట్టింది. ఇరుకుటుంబాల పెద్దలు కూర్చుని భార్యాభర్తల మధ్య రాజీ చేశారు. అయినా భర్త పద్ధతి మార్చుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. పెళ్లి పేరుతో మోసపోయానన్న బాధతో ఆత్మహత్య చేసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.