- హోమ్›
- వార్తలు›
- పుట్టినింటి నుంచి మెట్టినింటి కి వెళ్లిన కొన్ని రోజుల్లోనే హత్మహత్య చేసుకున్నా నవ వధువు...!
పుట్టినింటి నుంచి మెట్టినింటి కి వెళ్లిన కొన్ని రోజుల్లోనే హత్మహత్య చేసుకున్నా నవ వధువు...!
By: Anji Tue, 29 Dec 2020 10:35 PM
పెళ్లి కొన్ని రోజులు కూడా కాలేదు.. అప్పుడే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.. పుట్టినింటి నుంచి మెట్టినింటి కి వెళ్లిన కొన్ని రోజుల్లోనే ఈ విధంగా జరగడం చూస్తుంటే కొన్ని అనుమానాలకు దారితీస్తున్న అసలు ఏమైందో ఏమో అని అందరు ఆలోచిస్తున్నారు.
మొన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన రెండు ప్రేమ జంటలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరువక ముందే కొద్ది రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లాలోని వడ్లమూడి తండలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.
ఇప్పుడు నవ వధువు ఆత్మహత్య కలకలం రేపుతోంది. పెళ్ళైన 16 రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. భీమ దేవరపల్లి మండలం మాణిక్య పూర్ లో నవ వధువు రవళి (22)ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ధర్మ సాగర్ మండలం నారాయణగిరికి చెందిన రవళికి 16 రోజుల క్రితమే రాజు అనే వ్యక్తితో వివాహం అయింది. తనకు పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో రవళి పేర్కొంది. రవలి తాళి బొట్టు డ్రెస్సింగ్ టేబుల్ మీదపెట్టి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు.