Advertisement

బీహార్ ఎన్నికలు ..సర్వేలు ఎవరివైపు ?

By: Sankar Wed, 21 Oct 2020 10:57 AM

బీహార్ ఎన్నికలు ..సర్వేలు ఎవరివైపు ?


దేశంమొత్తం బీహార్‌ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.. అయితే, బీహార్‌లో జేడీయూ-బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ 133 నుంచి 143 స్థానాలతో అధికారంలోకి వస్తుందని లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సర్వే తేల్చి చెప్పింది. 243 స్థానాలున్న బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమికి 88 నుంచి 98 వరకూ స్థానాలు దక్కవచ్చని సర్వే తెలిపింది.

రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు సారథ్యం వహిస్తోన్న లోక్‌ జనశక్తి పార్టీకి రెండు నుంచి ఆరు స్థానాల్లో విజయం లభించవచ్చని, ఇతరులు ఆరు నుంచి పది స్థానాల్లో గెలవవచ్చని సర్వే అంచనా వేసింది. ఎన్డీఏకు 38 శాతం, మహాకూటమికి 32 శాతం ఓట్లు దక్కుతాయని అంచనా. ఎల్‌జేపీకి ఆరు శాతం ఓట్లు దక్కుతాయని ఒపీనియన్ పోల్ వెల్లడించింది.

బీహార్‌ ఎన్నికల్లో జేడీయూ కన్నా తమ పార్టీకే ఎక్కువ స్థానాలు వస్తాయని ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌ చెబుతున్నారు. అంతిమంగా భాజపా - ఎల్జేపీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందంటూ ఆయన ట్వీట్‌ చేశారు. అయితే, బీహార్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత అవసరమైతే చిరాగ్ పాశ్వాన్‌ సహకారం తీసుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. అయితే, ఈ ఊహాగానాలను ఎల్‌జేపీ తోసిపుచ్చింది.

Tags :
|
|

Advertisement