వైస్సార్సీపీ కీలక నేత అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ ..
By: Sankar Wed, 22 July 2020 6:29 PM
గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే వీడియో ద్వారా బుధవారం వెల్లడించారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ రిపోర్డు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రసుత్తం నా ఆరోగ్యం బాగానే ఉంది. హోం ఐసోలేషన్లో ఉన్నా. నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందవద్దని’’ కోరారు.
గత సోమవారం ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, విజయనగరం జిల్లా ఎస్.కోటా ఎమ్మెల్యే శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూర్ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే శివకుమార్ కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 15 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.
కాగా ఏపీలో గత 24 గంటల్లో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి ...ఒక్కరోజే 6,045 పాజిటివ్ కేసులు రావడంతో అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు..ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న కూడా కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు ..