మెగాస్టార్ చిరంజీవి కరోనా నుంచి కోలుకోవాలని అభిమానుల పూజలు..
By: Sankar Tue, 10 Nov 2020 3:33 PM
కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడంలేదు. ఇప్పటికే టాలీవుడ్ లో కొంతమంది హీరోలు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే సీనియర్ హీరో రాజశేఖర్ కరోనా నుంచి కోలుకున్నారు.
అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ ఆయన స్వయంగా తెలిపారు. మెగాస్టార్ కు కరోనా అని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నుంచి చిరంజీవి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రస్తుతానికి చిరంజీవి ఎలాంటి కరోనా లక్షణాలను అయితే కలిగి లేరు. కనుక ఆయన త్వరలోనే కరోనాను జయించి వస్తారని అంతా ఆశిస్తున్నారు.
మెగాస్టార్ కరోనా నుంచి కోలుకుని సంపూర్ణారోగ్యంతో మళ్లీ షూటింగ్ల్లో త్వరలో పాల్గొనాలని కోరుతూ తెలుగు రాష్ట్రల అభిమానులు ఆంజనేయ స్వామికి పూజలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో చిరంజీవి పేరు మీద జరుగుతున్న పూజల ఫొటోలు వైరల్ అవుతున్నాయి.