విశాఖ మధురవాడలో సినీ ఫక్కీలో భారీ దోపిడీ
By: chandrasekar Tue, 18 Aug 2020 5:08 PM
విశాఖలో పోలీసుల కారులో దర్జాగా వచ్చి దోపిడీ చేశారు. బాధితుడు కోటేశ్వరరావు ఇటీవల పెళ్లి కోసం భూమిని విక్రయించాడు. రూ.50
లక్షలు దాచుకున్నాడు. అందులో రూ.20
లక్షలతో ఫ్లాట్ కొనుగోలు చేద్దామని ఓ బ్రోకర్కు కోటేశ్వరరావు చెప్పినట్లు తెలుస్తోంది.
ఆ డబ్బును తీసుకెళ్తుండగా వైఎస్సార్ క్రికెట్ స్టేడియం సమీపంలో పోలీసులు వాహనం సైరెన్ కొట్టుకుంటూ దుండగులు వచ్చారు. తాము పోలీసులమని నమ్మించారు.
కోటేశ్వరరావుకు చెందిన రూ.20
లక్షలు పట్టుకొని దుండగులు పరారయ్యారు. డబ్బుతో పాటూ బ్రోకర్ను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే బ్రోకర్కు డబ్బు తీసుకెళ్తున్న విషయం ముందే తెలియడంతో పోలీసులు అతడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్రోకర్ను పట్టుకుంటే అన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు.