నాచారం లో దారుణం ..కన్న కూతురు అభ్యంతరకర ఫోటోలను చూస్తూ రాక్షసానందం పొందుతున్న తండ్రి
By: Sankar Wed, 19 Aug 2020 11:44 AM
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కసాయి వాడిగా మారాడు. కూతురి అభ్యంతకర ఫోటోలను ల్యాప్టాప్లో సేవ్ చేసి.. వాటిని చూస్తూ రాక్షసానందం పొందాడు. తండ్రి నిజస్వరూపం తెలియడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాలు.. నాచారం ప్రాంతంలో రెస్టారెంట్ ఓనర్గా పని చేస్తున్న నిందితుడు మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో నిందితుడు తన భార్యకు తెలియకుండా కుమార్తె అభ్యంతరకర ఫోటోలను తీసి తన ల్యాప్టాప్లో సేవ్ చేసుకున్నాడు. ఓ రోజు బాధితురాలు ల్యాప్టాప్ తీసి చూడగా తండ్రి బాగోతం బయటపడింది. కన్నతండ్రి ల్యాప్టాప్లో తన అభ్యంతరకర ఫోటోలు చూసి ఆమె తల్లడిల్లిపోయింది.
దీని గురించి బాధితురాలు తల్లికి తెలిపింది. అనంతరం నాచారం పోలీస్ స్టేషన్కు వెళ్లి తండ్రి మీద ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల తర్వాత అతడికి కరోనా సోకడంతో మందలించి విడిచిపెట్టారు. కోలుకోవడంతో ప్రస్తుతం నిందితుడిని మళ్లీ అరెస్ట్ చేశారు పోలీసులు.