Advertisement

  • మంత్రాలతో కరోనా దూరం చేస్తానని మోసం చేస్తోన్న వ్యక్తి అరెస్ట్

మంత్రాలతో కరోనా దూరం చేస్తానని మోసం చేస్తోన్న వ్యక్తి అరెస్ట్

By: chandrasekar Sat, 10 Oct 2020 5:17 PM

మంత్రాలతో కరోనా దూరం చేస్తానని మోసం చేస్తోన్న వ్యక్తి అరెస్ట్


టాస్క్‌ఫోర్స్ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడ్డ వారి ఆట కట్టిస్తున్నారు. తాజాగా మంత్రాల నెపంతో కరోనా వైరస్ ని పారదోలుతానంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే..సిరిసిల్ల పట్టణానికి చెందిన కంచర్ల కనకయ్య అనే వ్యక్తి తాయత్తులు, మంత్రాల నెపంతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు. పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

నిందితుడు జిల్లా ప్రజలే కాకుండా వేరే జిల్లాల నుంచి వచ్చే వారిని కూడా మంత్రాలు, తాయత్తులతో కరోనాను నయం చేస్తానని చెప్పి డబ్బులు తీసుకుంటున్నాడని సీఐ రవికుమార్ తెలిపారు. అతని దగ్గరి నుంచి ఉంగరాలు, రంగు రాళ్లు, మూలికలు మొదలగునవి స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నామని తెలిపారు.

Tags :
|
|

Advertisement