- హోమ్›
- వార్తలు›
- కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మ గౌడ మృతిపై ఉన్నత స్థాయి దర్యాప్తు...లోక్ సభ స్పీకర్
కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మ గౌడ మృతిపై ఉన్నత స్థాయి దర్యాప్తు...లోక్ సభ స్పీకర్
By: Sankar Wed, 30 Dec 2020 4:27 PM
కర్ణాటక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎస్ఎల్ ధర్మేగౌడ ఆత్మహత్య ఘటనపై లోక్సభ స్పీకర్ ఓంబిర్లా స్పందించారు. ధర్మేగౌడ మరణవార్త తనను చాలా బాధించిందని ఆయన పేర్కొన్నారు.
ఈ నెల 15న మండలిలో సభాపతి స్థానంలో ఆసీనులై ఉన్న ధర్మేగౌడను కొందరు సభ్యులు లాగిపడేయడం దురదృష్టకరమని ఓంబిర్లా వ్యాఖ్యానించారు. ఆ ఘటన ప్రజాస్వామ్యంపై జరిగిన తీవ్రమైన దాడి అని ఆయన అభివర్ణించారు.
ధర్మేగౌడ మృతిపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతుందని తెలిపారు.కాగా కర్ణాటక శాసన మండలి స్పీకర్ అయిన ధర్మ గౌడ రైలు కింద పది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే....
Tags :
speaker |
probe |
death |