విజయవాడ దుర్గమ్మవారి గుడి ట్రస్ట్బోర్డు సభ్యురాలి కారులో మద్యం బాటిళ్లు ...
By: chandrasekar Thu, 01 Oct 2020 12:05 PM
దుర్గమ్మ వారి గుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలి కారులో అక్రమ మద్యం
దొరికింది.
జగ్గయ్యపేటకి చెందిన చక్కా వెంకట నాగ వరలక్ష్మి ఆలయ
ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. బుధవారం జగ్గయ్యపేటలోని ఓ అపార్ట్మెంట్
పార్కింగ్లో ఉన్న ఏపీ 16 బీవీ 5577 నంబర్ కారులో పోలీసులు
తనిఖీ చేశారు. తెలంగాణలో విక్రయించే మద్యం బ్రాండ్లు అందులో ఉన్నాయి.. వాటిని సీజ్
చేసి డ్రైవర్ను అరెస్ట్ చేశారు. సీజ్ చేసిన మద్యం బాటిళ్ల విలువ సుమారు రూ.40వేల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.కారులో
భారీగా మద్యం ఉందని పోలీసులకు పక్కాగా సమాచారం అందింది. వెంటనే పోలీసులు తనిఖీలు
చేశారు.
రెండు రోజుల క్రితం
తెలంగాణ నుంచి భారీ ఎత్తున మద్యాన్ని తీసుకొచ్చినట్టు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే
ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నాగ వరలక్ష్మి వాదన మాత్రం మరోలా ఉంది. కారులో డీజిల్
ఫుల్ ట్యాంక్ చేయించుకురావాలని పంపించామని.. కానీ, అందులో మద్యం ఉన్న సంగతి తమకు తెలియదు అంటున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా
తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.