Advertisement

ఐసీయూ లో దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం

By: Sankar Fri, 14 Aug 2020 5:24 PM

ఐసీయూ లో దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం


ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌ కేర్‌ ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై శుక్రవారం సాయంత్రం వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కరోనా లక్షణాలతో ఆయన ఈ నెల 5న ఆస్పత్రిలో చేరారు. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షీణించడంతో రాత్రి నుంచి ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దేశంలో ఉన్న అతి గొప్ప సింగర్లలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఒకరు..ఎన్నో వేల పాటలకు తన గాత్రంతో ప్రాణం పోశారు ..దిగ్గజ నటులు ఎన్టీఆర్ , ఏఎన్నార్ , కృష్ణ , చిరంజీవి వంటి అగ్ర తరాల నుంచి మొదలు పెడితే ఇటీవల ఇండస్ట్రీకి వచ్చిన యువకులకు కూడా ఎస్పీబీ పాటలు పాడారు ..అయితే ఎస్పీబీ హెల్త్ పరిస్థితి తెలిసి అభిమానులు ఆందోళనలో ఉన్నారు

Tags :
|
|

Advertisement