శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై మరొకసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కంగనా రనౌత్
By: Sankar Mon, 07 Sept 2020 11:25 AM
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరొక సారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది..ముంబై నగరంలో ఉపాధి పొందుతూ ముమాబీ నగరాన్ని తిడితే ఊరుకోమని కాశంపం చెప్పాలి అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే..అయితే దీనికి కంగనా మాట్లాడుతు..తాను మహారాష్ట్రవాసిని కాదన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానని అన్నారు.
గతంలో ముంబై మహా నగరంలో బతకలేకపోతున్నామని చెప్పిన ఆమిర్ ఖాన్, నసీరుద్దీన్ షాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కంగనా ప్రశ్నించారు. ఒక మహిళను అయినందునే శివసేన ఎంపీ రెచ్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కంగనా ట్విటర్లో వీడియో విడుదల చేశారు.
సెప్టెంబర్ 9 న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను అడ్డుకోవాలని ఆమె విమర్శకులకు సవాల్ విసిరారు. ప్రస్తుతం ఆమె సిమ్లాలోని తన సొంతింట్లో ఉన్నారు. కాగా, సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని కంగనా అసహనం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. మంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ఇక్కడకు రావొద్దని సంజయ్ రౌత్ కంగనాకు కౌంటర్ ఇచ్చారు. ఎంపీ సంజయ్ బహిరంగంగా తనకు వార్నింగ్ ఇస్తున్నారని, ఇప్పడు తనకు ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్లా కనిపిస్తోందని కంగనా కామెంట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది.