జియో 5జీ స్మార్ట్ఫోన్ సరసమైన ధరలో
By: chandrasekar Thu, 16 July 2020 5:13 PM
రిలయన్స్ సంస్థ చైర్మన్
ముఖేశ్ అంబానీ మొబైల్ రంగంలో 5జీ సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు
పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రయోగాత్మకంగా 5జీ సర్వీసులు
అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. అయితే భారతీయ కస్టమర్లను దృష్టిలో
పెట్టుకున్న జియో సంస్థ.. త్వరలో 5జీ స్మార్ట్ఫోన్ను కూడా డెవలప్ చేయనున్నది.
గూగుల్ సంస్థతో ఒప్పందం
కుదుర్చుకున్న జియో 5జీ ఫోన్ను డిజైన్ చేసి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు
ముఖేశ్ తెలిపారు. ఇవాళ ఏజీఎమ్ను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు.
భారత్లో ఎక్కువ
స్థాయిలో ఫీచర్ ఫోన్ యూజర్లు ఉన్నారని, వారంత తక్కువ ధరకే వచ్చే స్మార్ట్ఫోన్కు అప్గ్రేడ్
కావాలనుకుంటున్నారని ముఖేశ్ చెప్పారు.
ఈ నేపథ్యంలోనే గూగుల్తో
కలిసి 4జీ
లేదా 5జీ
స్మార్ట్ఫోన్ను తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత మార్కెట్ ధర
ప్రకారం ఆ స్మార్ట్ఫోన్ను తయారు చేయగలమన్నారు. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ఫోన్
ఆపరేటింగ్ సిస్టమ్ను గూగుల్తో కలిసి డెవలప్ చేయనున్నట్లు ముఖేశ్ వెల్లడించారు.
జియో-గూగుల్ బంధం భారత్కు 2జీ నుంచి విముక్తి కల్పిస్తుందన్నారు. దేశంలో
సుమారు 35 కోట్ల
మంది 2జీ ఫీచర్
ఫోన్ను వాడుతున్నారని, వారికి సరసమైన ధరలోనే స్మార్ట్ఫోన్ అందిస్తామని
అంబానీ తెలియచేసారు.