జేఈఈ మెయిన్స్ 2021 షెడ్యూల్ విడుదల
By: Sankar Thu, 17 Dec 2020 08:48 AM
జేఈఈ మెయిన్-2021 షెడ్యూల్ను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం... 2021లో మొత్తం నాలుగు దశల్లో జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్...
మొదటి దశ పరీక్షలను ఫిబ్రవరిలో, రెండో దశ మార్చిలో, మూడో దశ ఏప్రిల్లో, నాలుగో దశ మే నెలలో నిర్వహించనున్నట్టు తెలిపారు.. మొదటి దశ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నాలుగు రోజులపాటు నిర్వహించనున్నారు.. ఆఖరి రోజు పరీక్ష తర్వాత నాలుగైదు రోజుల్లోనే ఫలితాలను వెల్లడించనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు..
అయితే, జేఈఈ మెయిన్ పరీక్షల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పలు మార్పులు చేసింది. గతంలో రెండు దశల్లో నిర్వహించే పరీక్షలను ఈసారి నాలుగు దశలకు పెంచింది. ప్రశ్నపత్రంలో ప్రాంతీయ భాషలను చేర్చింది. పరీక్ష ప్యాటర్న్లో స్వల్ప మార్పులు చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచింది ఎన్టీఏ.