- హోమ్›
- వార్తలు›
- ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ప్రభుత్వ బడిలో చదవాల్సిందే ..జార్ఖండ్ విద్యామంత్రి సంచలన వ్యాఖ్యలు
ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ప్రభుత్వ బడిలో చదవాల్సిందే ..జార్ఖండ్ విద్యామంత్రి సంచలన వ్యాఖ్యలు
By: Sankar Wed, 01 July 2020 9:35 PM
జార్ఖండ్లో విద్యా వ్యవస్థను చక్కదిద్దేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ మంత్రి మహతో చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదివేవారికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.మహతో బుధవారం మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారికి మాత్రమే ప్రభుత్వోద్యోగాలను ఇవ్వాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
అయితే ప్రజల సమ్మతి పొందిన తర్వాత మాత్రమే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివేవారు ప్రభుత్వోద్యోగాల కోసం వస్తున్నారన్నారు. ఇది సరికాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వోద్యోగం పొందాలంటే ప్రభుత్వ బడిలో చదవాలన్నారు. జార్ఖండ్లో విద్యా వ్యవస్థను చక్కదిద్దేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవలసి ఉందన్నారు.
ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని చెప్పారు. ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు కేవలం బోధనపై మాత్రమే దృష్టి పెట్టే విధంగా, వారికి బోధనేతర పనులు అప్పగించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాలలకు నాణ్యమైన విద్యను అందజేసేందుకు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.