ఐపీల్ 2020: రెండోసారి కరోనా టెస్టులో చెన్నై ప్లేయర్స్ కు నెగటివ్
By: chandrasekar Fri, 04 Sept 2020 8:15 PM
కరోనా కారణంగా ఐపీల్
2020 యూఏఈ లో జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా బారిన పడ్డ చెన్నై ప్లేయర్స్ కు చేసిన టెస్టులో నెగటివ్ గా తేలింది. ఐపీఎల్
2020 సీజన్ని సెప్టెంబరు 19 నుంచి ప్రారంభించేందుకు మార్గం సుగుమమైంది. గత వారం ఇద్దరు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లతో పాటు ఆ టీమ్లోని 11
మంది స్టాఫ్ కరోనా వైరస్ బారినపడగా తాజాగా రెండోసారి నిర్వహించిన కరోనా టెస్టులోనూ వారికి నెగటివ్ వచ్చింది.
సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగడం ఖాయమైంది. ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ సాధారణంగా డిఫెండింగ్ ఛాంపియన్, రన్నరప్గా నిలిచిన జట్ల మధ్య జరగడం ఫస్ట్ నుంచి ఆనవాయితీగా వస్తోంది. దాంతో ఐపీఎల్
2019 విజేత ముంబయి ఇండియన్స్, రన్నరప్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభ మ్యాచ్ జరిగేలా బీసీసీఐ ఇప్పటికే ప్రాథమికంగా షెడ్యూల్ రూపొందించింది.
ఇంతకు మునుపు చెన్నై జట్టులో 13
కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబరు 19 నాటికి ఆ జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో అని బీసీసీఐ గత వారం పునరాలోచనలో పడింది. ఈ క్రమంలో ఫస్ట్ మ్యాచ్ని ముంబయి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నిర్వహించేందుకు ఉన్న అవకాశాల్ని కూడా పరిశీలించింది. కానీ కేవలం మూడు రోజుల వ్యవధిలోనే కోలుకున్న చెన్నై టీమ్ తాజాగా రెండోసారి కరోనా పరీక్షల్లోనూ పాసయ్యింది. దాంతో ఆనవాయితీ ప్రకారం విజేత మరియు రన్నరప్ మధ్య మ్యాచ్ తొలి మ్యాచ్ గా జరగనుంది.