రెస్టారెంట్ల వినూత్న ప్రయత్నాలు...ఉచితంగా జిప్ మాస్క్...
By: chandrasekar Mon, 19 Oct 2020 3:41 PM
కరోనా కారణంగా
దేశవ్యాప్తంగా కొన్ని మాసాలుగా మూసివేసిన హాటల్స్, రెస్టారెంట్లు అన్లాక్లో
భాగంగా తెరుచుకుంటున్నాయి.
మరోవైపు కరోనా మహమ్మారి
వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న తరుణంలో వినియోగదారులకు రక్షణతోపాటు వారిని
ఆకట్టుకునేందుకు కొన్ని రెస్టారెంట్లు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ నేపధ్యంలో భాగంగా
పశ్చిమ బెంగాల్ కోల్కొతాలోని ఒక రెస్టారెంట్ తమ కస్టమర్లకు జిప్ మాస్కులను
ఉచితంగా అందజేస్తున్నది. దీంతో ఏదైనా తిన్నప్పుడు లేదా తాగినప్పుడు ఆ మాస్కుకు
ఉన్న జిప్ ఓపెన్ చేసుకుంటే సరి.
అనంతరం జిప్
మూసివేయవచ్చు. ఎలాంటి అదనపు చార్జి వసూలు చేయకుండానే తమ కస్టమర్లకు జిప్
మాస్కులను అందజేస్తున్నట్లు ఆ రెస్టారెంట్ యజమాని పేర్కొన్నారు.
అయితే దానిని వారు తప్పక
ధరించాలన్న నిబంధన ఏదీ లేదని తెలిపారు. కస్టమర్లు తమ మాస్కులతో రెస్టారెంట్కు
రావచ్చని తెలిపారు.