దేశంలో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు...
By: Sankar Tue, 29 Dec 2020 2:02 PM
భారత్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.. అయితే, కరోనావైరస్ కొత్త స్ట్రెయిన్ మాత్రం కలవరపెడుతోంది.. దేశవ్యాప్తంగా ఆరు స్ట్రెయిన్ కేసులు నమోదు అయినట్టు కేంద్రం ప్రకటించింది..
మరోవైపు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,432 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. కరోనాతో 252 మంది మృతి చెందారు.. ఇదే సమయంలో 24,900 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు..
దీంతో.. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,24,303కు చేరుకుంది.. ఇప్పటివరకు కరోనాబారిన పడిన 98,07,569 మంది రికవరీ కాగా.. కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 1,48,153కు పెరిగింది...
Tags :
india |
reports |
16432 |