భార్యకు కరోనా అని తెలిసి వదిలి పారిపోయిన భర్త ...వైద్యం అందక భార్య మృతి
By: Sankar Tue, 11 Aug 2020 06:50 AM
కరోనా మహమ్మారి మానవ సంబంధాల మీద చాల పెద్ద ప్రభావం చూయించింది..అప్పటిదాకా ఎంతో ప్రేమగా ఉన్నవారు కూడా కరోనా వచ్చింది అని తెలియగానే వారిని దూరం పెడ్తున్న సంఘ్టనలు అనేకం చూస్తున్నాం ..కరోనా మీద ఉన్న అపోహల వలన కట్టుకున్న భార్యను వదిలేసి భర్త పరారు అయినా ఘటన బెంగళూరులో జరిగింది ..సరైన టైం కు వైద్యం అందక ఆ భార్య కన్నుమూసింది ..
వివరాలు.. జేపీ నగర, శంకరమఠ వార్డులో గౌరి (27), మంజునాథ్ దంపతులు ఉంటున్నారు. రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు ఉత్తర కర్ణాటక ప్రాంతం నుంచి ఉపాధి కోసం వచ్చి బాడుగ ఇంట్లో జీవిస్తున్నాడు. భార్య ఒక షాపింగ్ మాల్లో సేల్స్ ఉమెన్గా, భర్త మరోచోట డ్రైవర్గా పనిచేసేవాడు.
బుధవారం ఆమెకు జ్వరం రాగా, ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని వచ్చారు. ఆమెకు కరోనా పాజిటివ్ అని ఫోన్ చేసి చెప్పారు. దీంతో భర్త మరుక్షణమే భార్యను వదిలిపెట్టి ఉడాయించాడు. ఆమెకు శ్వాసకోశ సమస్య అధికం కాగా, ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె శుక్రవారం ఇంట్లోనే మృతిచెందింది.
శనివారం ఇంటి యజమాని గమనించగా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమాని, స్థానిక కార్పొరేటర్ శివరాజ్లు పలుమార్లు మంజునాథ్కు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు. చివరికి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. ఇక మృతురాలి బంధువులకు ఫోన్ చేసి చెప్పగా, ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లినరోజు నుంచే సంబంధం తెగిపోయిందని చెప్పేశారు. చివరకు కార్పొరేటర్ తదితరులే కార్పొరేషన్ అంబులెన్స్ను రప్పించి అంత్యక్రియలు జరిపించారు. ఘరానా భర్తపై శంకరమఠ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు