పీఎం నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం విశేషాలు
By: Sankar Sun, 30 Aug 2020 12:25 PM
దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అందరూ స్వదేశీ యాప్లనే వాడాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం మనకీ బాత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతినుద్ధేశించి మోదీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా రైతులు కష్టపడి పంటలు పండిస్తున్నారని కొనియాడారు. ప్రతి వేడుకను పర్యావరణహితంగా జరుపుకోవాలని చెప్పారు. చిన్నారులు ఆడుకునే వస్తువులను ప్రపంచస్థాయిలో తయారు చేయాలని, స్థానిక కళలు, కళాకారులను ప్రోత్సహించాలన్నారు..
కేరళ సంప్రదాయ పండుగ ఓనమ్ వ్యవసాయంతో ముడిపడి ఉందని చెప్పారు. మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక కొత్త ప్రారంభం సమయం. ‘మన జీవితాలు, సమాజం వ్యవసాయం శక్తితో నడిచేవి. మన రైతుల జీవనశక్తిని కూడా వేదాలు ఎంతో ఘనంగా వర్ణించాయి’ అని ప్రధాని అన్నారు. ఓనమ్ పండుగ అంతర్జాతీయ పండుగగా మారిందని ఆయన అన్నారు. ‘ఓనమ్ నేడు సుదూర తీరాలకు చేరుకుంది. అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలైనా.. సరే ప్రతిచోటా అనుభూతి చెందవచ్చన్నారు.
రుగ్వేదంలో ఒక మంత్రం ఉంది.. ‘అన్నాన్ని ఇచ్చేవాడు.. రైతును పొగడాలి’ అన్నారు. కరోనా మహమ్మారి సమయంలోనూ సత్తా చాటారన్నారు. ఖరీఫ్లో పంటలను విత్తడం ఏడు శాతం.. గత సంవత్సరంతో పోలిస్తే వరి 10శాతం ఎక్కువ, పప్పుధాన్యాలు 5 శాతం, పత్తి 3శాతం, ముతక ధాన్యం, వోట్స్, తృణధాన్యాలు 3శాతం, నూనె గింజలు 13 శాతం’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘నేను దేశ రైతులను అభినందిస్తున్నాను. ముందు వారి శ్రమకు నమస్కరిస్తున్నాను’ అన్నారు