హరీష్ రావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన గవర్నర్ తమిళిసై
By: Sankar Sun, 06 Sept 2020 12:14 PM
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం విదితమే. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్వీట్ చేశారు. కరోనా నుంచి హరీష్రావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు.
వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షచేయించుకోగా పాజిటివ్గా తేలిందని మంత్రి హరీష్రావు స్వయంగా శనివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్లో ఉన్నారు. వైద్యుల సూచనలను పాటిస్తున్నారు. ‘కరోనా ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో నేను వైరస్ నిర్ధారణ పరీక్షచేయించుకున్నాను. పాజిటివ్గా నివేదిక వచ్చింది.
ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇటీవల నన్ను కలిసినవాళ్లు ఐసొలేషన్లో ఉండి, కరోనా టెస్ట్ చేయించుకోండి. ఎవరూ నన్ను కలుసుకోవడానికి ప్రయత్నించకండి. నా హెల్త్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకుంటాను’ అని మంత్రి హరీశ్రావు ట్వీట్చేశారు.