అథ్లెట్ల కోసం గోపీచంద్ ఫౌండేషన్, మైత్రా ఎనర్జీ మరోమారు సాయం
By: chandrasekar Sat, 28 Nov 2020 3:08 PM
దేశంలో అథ్లెట్ల కోసం
గోపీచంద్ ఫౌండేషన్ మరియు మైత్రా ఎనర్జీ మరోమారు సాయం చేయనుంది. అథ్లెట్ల భవిష్యత్కు
బంగారు బాట వేసేందుకు గోపీచంద్ ఫౌండేషన్, మైత్రా ఎనర్జీ మరోమారు ముందుకొచ్చాయి. ప్రతిభ కల్గిన
అథ్లెట్లకు అండగా నిలువాలన్న సదుద్దేశంతో 2016లో ప్రారంభమైన ఖేల్ ఉడాన్ భాగస్వామ్యం మరో మూడేండ్ల
పాటు కొనసాగేందుకు సిద్ధమైంది.
ప్రస్తుతం ఇందులో భాగంగా
జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, మైత్రా ఎనర్జీ ప్రతినిధుల
మధ్య ఒప్పందం కుదిరింది. సాయ్, సాట్స్ సహకారంతో గోపీచంద్-మైత్రా ముందుకు సాగనుంది.
జాతీయ, అంతర్జాతీయ
స్థాయిలో అథ్లెట్లు పోటీపడేలా తీర్చిదిద్దేందుకు కావాల్సిన సౌకర్యాలను
కల్పించనుంది. టెక్నికల్, ఫిజికల్, మానసిక సంసిద్ధత, ఆహారం, మెంటార్షిప్ తదితర అంశాల్లో అథ్లెట్లకు అండగా
నిలువనుంది.