GHMC Election Results... TRS ఎమ్మెల్యే భార్యపై BJP అభ్యర్థి ఘన విజయం...
By: chandrasekar Fri, 04 Dec 2020 8:10 PM
గ్రేటర్ హైదరాబాద్
మునిసిపల్ ఎలక్షన్స్ 2020 ఫలితాలలో బీజేపీ పుంజుకుంది. అధికార టీఆర్ఎస్ ఎస్
పార్టీ ఆధిక్యాన్ని తగ్గించింది. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే
భార్య జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇటీవల వరద నీరు వచ్చిన సమయంలో
అక్కడికి వెళ్లిన సమయంలో, ఓట్లకు వెళ్లిన సమయంలోనూ నిరసన రావడం తెలిసిందే.
హబ్సిగూడ డివిజన్ నుంచి పోటీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి భార్య బేతి
స్వప్న ఓటమి చెందారు.
బేతి స్వప్నపై బీజేపీ
అభ్యర్థి చేతన గెలుపొందారు. ఖైరాతాబాద్ డివిజన్లో దివంగత పి.జనార్దన్
రెడ్డి కుమార్తె, టీఆర్ఎస్
అభ్యర్థి విజయా రెడ్డి గెలుపొందారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020 ఫలితాలలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు 36
స్థానాల్లో విజయం సాధించగా, మరో 22 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎంఐఎం పార్టీ 30
స్థానాలను గెలుచుకోగా, మరో 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికారం మాదే అంటూ
ఎన్నికల బరిలో దిగిన బీజేపీ 26 డివిజన్లలో విజయబేరి మోగించగా మరో 20
స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ కేవలం రెండు డివిజన్లకే
పరిమితమైంది. ఇతరులు ఖాతా తెరవలేదు.