కరోనా బారిన పడిన ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు...
By: Sankar Fri, 18 Sept 2020 6:13 PM
కరోనా కారణంగా అత్యంత కఠిన నియమాలతో ఇంగ్లాండ్ జట్టు వరుసగా క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్న విషయం తెలిసిందే..ఇప్పటికే వెస్ట్ ఇండీస్ , పాకిస్తాన్ , ఆస్ట్రేలియా , ఐర్లాండ్ లతో వరుసగా సిరీస్లు ఆడింది..అయితే తాజాగా ఇంగ్లాండ్ ఆటగాడు కరోనా బారిన పడ్డాడు..
ఇటీవల ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్లో ఆడిన డేవిడ్ విల్లీ.. ప్రస్తుతం విటాలిటీ టీ20 బ్లాస్ట్లో యార్క్షైర్ తరఫున మ్యాచ్లు ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య బుధవారం రాత్రి మూడు వన్డేల సిరీస్ ముగియగా.. ఈ సిరీస్కి డేవిడ్ విల్లీ ఎంపికవలేదు. ఇంగ్లాండ్ తరఫున 48 వన్డేలు, 28 టీ20 మ్యాచ్లను విల్లీ ఆడాడు.
ఇంగ్లాండ్ జట్టులోని ఓ ఇంటర్నేషనల్ క్రికెటర్కి కరోనా వైరస్ సోకడం ఇదే తొలిసారికాగా.. డేవిడ్ విల్లీతో పాటు అతని భార్యకి కూడా కరోనా పాజిటివ్గా తేలింది..అయితే యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్లు జరగనుండగా.. ఐపీఎల్లో ఆడేందుకు డేవిడ్ విల్లీ నిరాకరించాడు. విటాలిటీ టీ20 బ్లాస్ట్లో ఆఫర్ రావడంతోనే అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున గతంలో డేవిడ్ విల్లీ మ్యాచ్లు ఆడాడు.