తెలంగాణ కొత్త సచివాలయ డిజైన్ పై నేడు చర్చ
By: chandrasekar Wed, 22 July 2020 4:49 PM
తెలంగాణ రాష్ట్ర కొత్త
సచివాలయం డిజైన్ ప్రదానాంశంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన సమీక్ష
నిర్వహించనున్నారు.
తెలంగాణ సచివాలయం
కూల్చివేతలో ఎదురైన కోర్టు ఇబ్బందులన్నీ తొలగిపోవడంతో ఆ పనులు కొనసాగుతున్నాయి. ఇక
ఇప్పుడు అదే ప్రాంతంలో నిర్మించబోతున్న కొత్త సచివాలయ డిజైన్ ఎలా ఉండనుందనే
విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే నూతన సచివాలయ
డిజైన్ ఒకటి మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపధ్యంలో మధ్యాహ్నం 2
గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో
ప్రధానంగా కొత్త సచివాలయ డిజైన్ పై చర్చ జరగనుంది.
పాత సచివాలయం కూల్చివేత
పనులు, కొత్త
సెక్రటేరియన్ నిర్మాణంపై ఆర్ అండ్ బి అధికార్లతో సమీక్షించనున్నారు. మరోవైపు ఇటీవల
వివాదాస్పదమవుతున్న ఉస్మానియా ఆసుపత్రి విషయంలో కూడా కేసీఆర్ ఓ నిర్ణయం
తీసుకోనున్నారు.