- హోమ్›
- వార్తలు›
- హనుమంతరావు మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి ... టీపీసీసీ అధికార ప్రతినిధి దేవని సతీష్ మాదిగ
హనుమంతరావు మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి ... టీపీసీసీ అధికార ప్రతినిధి దేవని సతీష్ మాదిగ
By: Sankar Sun, 27 Dec 2020 6:23 PM
తెలంగాణాలో టీపీసీసీ చీఫ్ ఎంపిక మీద వివాదాస్పద వాక్యాలు చేసిన హనుమంత్ రావు మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ కోదండ రెడ్డి కి ఫిర్యాదు చేసారు టీపీసీసీ అధికార ప్రతినిధి దేవని సతీష్ మాదిగ.
తెలంగాణ ఇంచార్జ్ మాణిక్య ఠాగూర్ పై మరియు రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన హనుమంతరావు పై చెర్యలు తీసుకోవాలి. మాణిక్య ఠాగూర్ గారు రేవంత్ రెడ్డి కి అమ్ముడు పోయాడని మీడియా ముందు తప్పుడు మాటలు మాట్లాడాడు ఆయన.
రేవంత్ రెడ్డి ని పీసీసీ అధ్యక్షులు గా నియమించిస్తే, రాజీనామా చేస్తానని హనుమంతరావు బెదిరింపులకు దిగితున్నాడు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాణిక్య ఠాగూర్ ను హనుమంతరావు అవమాన కరంగా మాట్లాడడం బాధాకరం అని దేవని సతీష్ పేర్కొన్నారు.
Tags :
fires |