యూకే విమానాలపై నిషేధం విధించండి ...ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
By: Sankar Mon, 21 Dec 2020 1:04 PM
ఇంకా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గనేలేదు అంతలోనే బ్రిటన్ లో ఇంకో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది..దీనితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి..కరోనా ను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆపసోపాలు పడుతున్న ప్రజలు , ప్రభుత్వాలకు ఈ కొత్త వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది...
దీనితో యూకే నుంచి వచ్చే విమానాలపై ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, బల్గేరియా, బెల్జియం, ఆస్ట్రియా, కెనడా, ఇటలీలాంటి దేశాలు నిషేధం విధించాయి. కరోనా కొత్త వేరియంట్ తమ దేశాల్లో అడుగుపెట్టకుండా వీళ్లు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా యూకే విమానాలపై నిషేధం విధించాలని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కోరుతున్నారు.
తక్షణమే ఈ నిర్ణయం తీసుకోవాలంటూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. బ్రిటన్లో కరోనా వైరస్ కొత్త మ్యుటేషన్ వచ్చింది. ఇది చాలా వేగంగా వ్యాపిస్తోంది. అందుకే యూకే నుంచి వచ్చే అన్ని విమానాలను వెంటనే నిలిపివేయాలి అని కేజ్రీవాల్ ఆ ట్వీట్లో కోరారు