చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు భారీ ఊరట ..టీం లో అందరికి కరోనా నెగటివ్
By: Sankar Tue, 01 Sept 2020 6:35 PM
చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టులో ఇద్దరు ఆటగాళ్లు సహా పది మందికి కరోనా పాజిటివ్గా తేలడంతో టీమ్ మేనేజ్మెంట్, బీసీసీఐతో పాటు మిగతా ప్రాంఛైజీలు కూడా షాక్కు గురయ్యాయి. తాజాగా సీఎస్కే అభిమానులకు పెద్ద ఉపశమనం కలిగించే వార్త బయటకు వచ్చింది. ఇటీవల కరోనా బారినపడ్డ ఇద్దరు ఆటగాళ్లతో పాటు మిగతా సహాయ సిబ్బందికి తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్గా వచ్చినట్లు తెలిసింది.
చెన్నైకి చెందిన బౌలర్ దీపక్ చాహర్, యువ బ్యాట్స్మన్ రుతురాజ్ గైక్వాడ్కు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వీరిని ఐసోలేషన్లో ఉంచారు. వీరందరినీ బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తున్నది. ఇప్పటి వరకు ట్రైనింగ్ను ప్రారంభించకపోవడంతో చెన్నై జట్టు ఇబ్బంది పడుతున్నది. నెగెటివ్గా తేలిన వారంతా సాధనలో పాల్గొనాలంటే సెప్టెంబర్ 3న నిర్వహించే టెస్టులో మరోసారి కోవిడ్-19 ఫలితం నెగెటివ్గా రావాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 12 వరకు చాహర్, గైక్వాడ్ క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది.
కాగా సెప్టెంబర్ 19 నుంచి ఐపీయల్ ప్రారంభం అవ్వనుండగా తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతాయి అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ లో తలపడే అవకాశం కనిపించడం లేదు..దీనితో ముంబై ఇండియన్స్ , ఆర్సీబి తొలి మ్యాచ్ లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది