పార్లమెంట్ బిల్డింగ్లో వ్యక్తికి కరోనా
By: chandrasekar Fri, 29 May 2020 7:16 PM
రాజ్యసభ సెక్రెటేరియట్లోని
ఓ ఉన్నతాధికారికి కోవిడ్-19 సోకినట్టు తేలింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి
మరింత ఉద్ధృతమవుతోంది. తాజాగా, రాజ్యసభ సెక్రటేరియట్ అధికారికి వైరస్ పాజిటివ్గా
నిర్ధారణ అయ్యింది. పార్లమెంట్ కాంప్లెక్స్లో ఇది నాలుగో కేసు అని విశ్వసనీయ
వర్గాలు పేర్కొన్నాయి. మే 28న విధులకు హాజరైన డైరెక్టర్ స్థాయి అధికారి, ఆయన
కుటుంబంలోని పలువురికి వైరస్ నిర్ధారణ అయినట్టు తెలిపాయి.
రాజ్యసభ సెక్రటేరియట్
అధికారికి వైరస్ నిర్ధారణ కావడంతో పార్లమెంట్ భవనంలోని రెండు అంతస్థులను
మూసివేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ భవనంలో విధులు నిర్వర్తించే
ఉన్నతాధికారికి కరోనా వైరస్ సోకడం ఇది రెండో కేసు. లోక్సభ సెక్రటేరియట్లోని ఓ
అధికారి సైతం కరోనా బారినపడ్డారు. ఎడిటోరియల్ అండ్ ట్రాన్స్లేషన్ సర్వీస్లోని
అధికారికి వైరస్ నిర్ధారణ అయ్యింది. పార్లమెంట్ భవనంలో తొలిసారిగా మార్చి 23న హౌస్
కీపింగ్ ఉద్యోగికి వైరస్ సోకింది. దీంతో మార్చి 23న బడ్జెట్ సమావేశాలను
అర్ధాంతరంగా వాయిదా వేశారు. తర్వాత మరో సెక్యూరిటీ అధికారికి వైరస్ పాజిటివ్గా
తేలింది.
రాష్ట్రపతి భవన్
పారిశుద్ధ్య కార్మికురాలి బంధువుకు కరోనా వైరస్ సోకింది. కరోనా వైరస్ సోకిన
పారిశుద్ధ్య కార్మికురాలి బంధువు రాష్ట్రపతి భవన్ కాంప్లెక్సులో నివాసముంటోంది.
పారిశుద్ధ్య కార్మికురాలి కోడలు తల్లి ఇటీవల కరోనాతో మరణించడంతో ఆమె
అంత్యక్రియల్లో రాష్ట్రపతి భవన్ కార్మికురాలు పాల్గొంది.
రాష్ట్రపతి భవన్
పారిశుద్ధ్య కార్మికురాలి బంధువుకు కరోనా పాజిటివ్ సోకడంతో ఆమె కుటుంబసభ్యులను
కూడా పరీక్షించారు. వారికి కరోనా నెటిటివ్ అని సోకినా వారిని ఐసోలేషన్కు
తరలించారు. అనంతరం రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్లోని 125
గహాలను శానిటైజ్ చేసి, వారందరినీ సెల్ఫ్ ఐసోలేషన్ కు తరలించారు.