ఆందోళన కరంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం
By: chandrasekar Sat, 12 Dec 2020 10:34 PM
లాలూ ప్రసాద్ యాదవ్ జనతాదళ్
(ఆర్జేడీ) చీఫ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు స్థిరంగా లేదని వైద్యులు తెలిపారు. లాలూ
కిడ్నీ పనితీరు మరింత దిగజారింది. మూత్రపిండాలు పనితీరు అంతకుముందు వున్న 50 శాతం నుంచి 37 శాతానికి తగ్గిందని, అందువల్ల అయన పరిస్థితి
ఆందోళన కరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. లాలూ ప్రసాద్ రక్తంలో చక్కెర మరియు
రక్తపోటు స్థాయిలు కూడా హెచ్చుతగ్గులకు గురవుతున్నాయని సీనియర్ వైద్యుడు శనివారం
చెప్పారు. 71 ఏళ్ల నాయకుడు జార్ఖండ్లోని రాంచీలోని రాజేంద్ర
ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు అతనికి
అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ అందిస్తున్నారు.
గత 20
ఏళ్లుగా లాలూ ప్రసాద్ యాదవ్ మధుమేహ వ్యాధితో బాధపడుతున్నందున కిడ్నీ
దెబ్బతిన్నాయని అందువల్ల ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని చెప్పారు. ఏ
నిమిషంలోనైనా పరిస్థితి దిగజారే అవకాశం ఉందని రిమ్స్కు లిఖితపూర్వకంగా తాను తెలియజేశానని డాక్టర్ ప్రసాద్ చెప్పారు. అతని
ఆహారం కూడా మునుపటితో పోలిస్తే బాగా
తగ్గింది. మేము ఇప్పుడు అతనికి మందులు ఇస్తున్నాము అని చెప్పారు. ఆర్జేడీ నాయకుడి కుమారుడు తేజశ్వి
యాదవ్ శనివారం రాంచీకి తన తండ్రిని కలవడానికి మరియు అతని ఆరోగ్యాన్ని పరిశీలించడానికి
వచ్చారు. పశుగ్రాసం కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన తరువాత లాలూ ప్రసాద్ యాదవ్ 2017 నుండి
జైలు శిక్ష అనుభవిస్తున్నారు.