Advertisement

మంచి పనికోసం బిక్షాటన చేసిన షకలక శంకర్

By: Sankar Thu, 17 Sept 2020 2:42 PM

మంచి పనికోసం బిక్షాటన చేసిన షకలక శంకర్


టాలీవుడ్ నటుడు శకలక శంకర్ కరోనా విజృంభనతో తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కుటుంబాలను ఆదుకోవడానికి కరీంనగర్ వీధుల్లో భిక్షాటన చేశారు.

ఈ కార్యక్రమంలో ఆయనకు 90వేలు ప్రజలు అందజేశారు. వాటితో పాటు శంకర్ తాను 10వేలను కలిపి మొత్తం 1లక్ష రూపాయలను ఆర్థిక ఇబ్బందులు ఏసుర్కొంటున్న ఏడు కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు శంకర్ ను స్థానికులు అభినందించారు. కాగా గతంలో లాక్ డౌన్ సమయంలో కూడా ఆయన అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా లక్షా పదివేలతో ఓ రైతు కూలీ కుటుంబానికి కాడెద్దులను కొనిచ్చారు.

ఇలా వరుస సేవా కార్యక్రమాలు చేస్తూ శంకర్ తన మంచి మనసును చాటుకుంటున్నారు. ఇదిలా ఉండగా జబర్దస్త్ ప్రోగ్రాం తో తెలుగు ప్రేక్షకులకి సూపరిచితుడైన శంకర్ ఆ తరవాత సినిమాల్లో బిజీ అయిపోయారు. అనేక చిత్రాల్లో కమెడియన్ గా చేసిన శంకర్ హీరో గా సైతం పరాన్న జీవి అనే సినిమాలో నటించారు.

Tags :

Advertisement