Advertisement

రైతులకు శుభవార్త ...రేపటి నుంచే రైతు బంధు సాయం

By: Sankar Sun, 27 Dec 2020 6:39 PM

రైతులకు శుభవార్త ...రేపటి నుంచే రైతు బంధు సాయం


ఈ నెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల (జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు.

రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి ఇవాళ ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం రూ.7,515 కోట్ల రూపాయలు పంట సాయంగా అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.కాగా తెలంగాణాలో రైతులు పంట పండించేందుకు కావలసిన ముడి సరుకులకోసం తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెరాస ప్రభుత్వం ఈ రైతు బంధు పథకంను ప్రవేశపెట్టింది ...ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది...

Tags :
|
|
|
|

Advertisement