పబ్ జి సహా యాప్స్ నిషేధంపై స్పందించిన చైనా
By: Sankar Thu, 03 Sept 2020 5:08 PM
పబ్జీ సహా 118 యాప్లను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై చైనా గురువారం స్పందించింది. చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి గో ఫెంగ్ మాట్లాడుతూ దేశం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్లు, సర్వీస్ ప్రొవైడర్ల చట్టబద్ధ ప్రయోజనాలను భారత్ ఉల్లంగించిందని ఆరోపించారు. చైనా యాప్లపై బ్యాన్ విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ నిర్ణయం విచారకమని, మరోసారి నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కోరారు.
కాగా, భారత సైబర్ స్పేస్ భద్రతే లక్ష్యంగా పబ్జీ సహా 118 చైనా యాప్లను నిషేధిస్తూ నిర్ణయం విషయం తెలిసిందే. పలు యాప్లు యూజర్ల డేటాను చట్టవిరుద్ధంగా భారత్కు వెలుపల ఉన్న సర్వర్లకు చేరవేస్తున్నట్లు తమకు వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు అందినట్లు ప్రభుత్వం తెలిపింది.
దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, రక్షణ, భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ‘హానికర యాప్’లపై నిషేధం విధించాలని హోంశాఖకు చెందిన సైబర్ క్రైమ్ సెంటర్ సిఫార్సు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.