చైనా పత్తి దిగుమతులపై నిషేధం విధించిన అమెరికా...
By: chandrasekar Tue, 15 Dec 2020 9:40 PM
అమెరికాలోని చాలా అపరల్
సంస్థలు చైనా ఎక్స్పీసీసీ ఉత్పత్తి చేసిన కాటన్ ఫైబర్పై ఆధారపడుతున్నాయి. ఒక్క 2019లోనే
చైనా నుంచి 11 బిలియన్ డాలర్ల విలువైన కాటన్ టెక్స్టైల్, అపరల్
ప్రొడక్ట్స్ను అమెరికా దిగుమతి చేసుకుంది. చైనాతో వాణిజ్య యుద్ధం సాగుతున్న వేళ
అమెరికా ప్రభుత్వం ఎక్స్పీసీసీ నుంచి పత్తి దిగుమతులపై నిషేధం విధించింది. చైనాలో
మూడొంతుల పత్తిని ఎక్స్పీసీసీ ఉత్పత్తి చేస్తోంది. ఇది జిన్జియాంగ్ ఆర్థిక
వ్యవస్థలో దాదాపు 17 శాతానికి సమానం. ఈ నిషేధం ప్రభావం వల్ల భారత్కు
మేలు జరుగుతుందని ఐసీఆర్ఏ అంచనా.
చైనా కాటన్పై అమెరికా
నిషేధం విధించడానికి ముందే భారత కాటన్ ఎగుమతుల అవకాశాలు పెరిగాయి. ఇప్పటికే భారత
దుస్తుల ఎగుమతదారులకు ఆర్డర్లు పెరిగాయని ఆ ఏజెన్సీ తెలిపింది. చైనా కాటన్పై
నిషేధం విధించడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేలా భారత సంస్థలు
ప్రయత్నిస్తున్నాయన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో భారత
పత్తి ఎగుమతులు 65 లక్షల బేళ్లకు చేరతాయని నిపుణులు భావిస్తున్నారు. 40 లక్షల
బేళ్ల పత్తి మాత్రమే ఎగుమతి అవుతుందని జూన్లో అంచనా వేశారు. గత ఏడాది భారత్ నుంచి
40 లక్షల
బేళ్ల పత్తి ఎగుమతయ్యింది. రూపాయి విలువ పడిపోవడం, ప్రపంచవ్యాప్తంగా పత్తి ధరలు
17 నెలల
గరిష్టానికి చేరడంతో ట్రేడర్ల మార్జిన్ పెరగనుంది.