చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్స్
By: chandrasekar Thu, 06 Aug 2020 3:52 PM
బుధవారం సాయంత్రం #GetWellSoonCBN
హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్గా ట్రెండింగ్లో ఉంది.
ట్విటర్లో చంద్రబాబు పేరు మార్మోగుతోంది.
వైసీపీ నేతలు, కార్యకర్తలు
పెద్ద ఎత్తున ఈ హ్యాష్ ట్యాగ్తో ట్వీట్స్ చేస్తున్నారు. చంద్రబాబు త్వరగా
కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్స్ పెడుతున్నారు.
హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు వైసీపీ నేతలు
చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ట్వీట్స్ చేశారు. దాంతో వైసీపీ అభిమానులు, వైఎస్ జగన్ ఫ్యాన్స్ కూడా తమ సత్తా చాతుతున్నారు. #GetWellSoonCBN
పేరుతో పదుల సంఖ్యలో పోస్టులు పెడుతూ ఆ హ్యష్ ట్యాగ్ను
ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో మూడు
రాజధానులను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధానిని తరలిస్తూ అమరాతిని
చంపేస్తున్నారంటూ సీఎం జగన్పై చంద్రబాబు మండిపడుతున్నారు. ప్రజలను నమ్మించి మోసం
చేశారని అందరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామని స్పష్టం చేశారు. మూడు రాజధానుల
నిర్ణయాన్ని వెనకైనా తీసుకోవాలని లేదంటే రాజీనామా చేయాలని అల్టిమేటం ఇచ్చారు.
చంద్రబాబు అందుకు రెండు రోజుల పాటు డెడ్లైన్ పెట్టారు.