చంద్రబాబు కూడా జైలుకు వెళ్లడం ఖాయం: రోజా వ్యాఖ్యలు
By: chandrasekar Sat, 13 June 2020 8:18 PM
టీడీఎల్పీ ఉపనేత, మాజీ
మంత్రి అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన తీరుఫై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం
చేశారు. దానికి స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా "తప్పు చేశారే కాబట్టే
మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసిందని" అన్నారు. అధికారం
కోల్పోయినప్పటి నుంచి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థంకావడం లేదని రోజా
విమర్శించారు.
తప్పు చేసిన వ్యక్తి బీసీ
అయినా ఓసీ అయినా చట్టం ముందు అంతా సమానమే అని వ్యాఖ్యానించారు. లోకేశ్ మాటలకు
విలువ లేదని ప్రజల్లో గెలవలేని వ్యక్తి చెప్పే మాటలు ఎవరూ పట్టించుకోరని ఆమె
అన్నారు. తాము తప్పు చేస్తే అరెస్ట్ చేసుకోవచ్చని గతంలో తొడగొట్టిన లోకేశ్
సాక్ష్యాలతో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే ఎందుకు మండిపడుతున్నాడని
విమర్శించారు.
ప్రస్తుతం అచ్చెన్నాయుడి
అవినీతితో దొరికిపోయాడని ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుకల్లో జరిగిన అవినీతితో చంద్రబాబు కూడా
జైలుకు వెళ్లడం ఖాయమని రోజా వ్యాఖ్యానించారు.