డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ పై స్పందించిన కేంద్రం
By: Sankar Fri, 13 Nov 2020 1:21 PM
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనితో వాస్తవాల కంటే కల్పితాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఫేక్ న్యూస్ స్పీడ్గా విస్తరిస్తోంది. తాజాగా ప్రజలను కంగారు పెట్టేలా ఓ పుకారు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
”కరోనా కేసులు ఇంకా అదుపులోకి రానందున డిసెంబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధిస్తారు” అనే ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనితో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. మళ్లీ లాక్డౌన్ విధిస్తారన్న వార్తను కొట్టిపారేసింది.
ఆ ట్వీట్ను ఎవరో మార్ఫింగ్ చేశారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. మరోసారి లాక్డౌన్ విధించడంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ట్వీట్ పోస్ట్ చేసింది. కాగా, దేశంలో ప్రస్తుతం అన్లాక్ 5.0 మార్గదర్శకాలు అమలవుతున్న సంగతి తెలిసిందే.