రూ.కోటి విలువ చేసే నోట్ల కట్టలు విజయవాడలో...
By: chandrasekar Mon, 30 Nov 2020 5:51 PM
విజయవాడ పండిట్ నెహ్రు
బస్ స్టాండ్ దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు
వ్యక్తుల దగ్గర తనిఖీ చేశారు. వారి దగ్గరున్న లగేజీని పరిశీలించి అవాక్కయ్యారు.
ఇద్దరి నుంచి రూ.కోటి నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు.
సరైన పత్రాలు చూపించక
పోవడంతో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఆ డబ్బును పోలీస్ స్టేషన్కు
తరలించారు. భారీ స్థాయిలో డబ్బులు దొరకడంతో పోలీసులు అనుమానాలు వ్యక్తం
చేస్తున్నారు.
విజయవాడ నుంచి ఈ డబ్బును
హవాలా మార్గంలో అనంతపురం జిల్లా గుంతకల్లుకి తరలిస్తున్నట్లు పోలీసులు
కనుగొన్నారు. డబ్బులు తరలిస్తుండగా ఈ ముఠాను ఎంతో
చాకచక్యంగా పట్టుకున్నారు. హవాలా మూలాలపై టాస్క్ఫోర్స్ ఏడీసీపీ
శ్రీనివాసులు ఆరా తీస్తున్నారు.
అరెస్ట్ చేసిన ఇద్దరు
వ్యక్తుల నుంచి వివరాలు కనుకొంటున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఇలా డబ్బు
పట్టుబడుతూనే ఉంది.. వీటిలో కొన్ని వ్యాపారులకు సంబంధించిన డబ్బు కాగా.. మరికొన్ని
హవాలా రూపంలో తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.