కోహ్లీ మీద ఒత్తిడి తగ్గాలంటే ఆ ఆటగాడిని వైస్ కెప్టెన్ గా నియమించాలి ..బ్రెట్ లీ
By: Sankar Mon, 10 Aug 2020 3:57 PM
ఇండియా లో చాల కాలం తర్వాత క్రికెట్ గురించి వార్తలు వస్తున్నాయి ..కరోనా కారణంగా క్రికెట్ మ్యాచ్లు లేక డల్ అయిన అభిమానులను జోష్ లో నింపడానికి మరికొద్ది రోజుల్లో ఐపీయల్ ప్రారంభం కానుంది ..ఈ సారి ఐపీయల్ నిర్వహించేది యూఏఈ లో కావడంతో ప్రత్యేకంగా ఈ టీం గెలుస్తుంది అని ఎవరు అంచనా వేయలేకపోతున్నారు ..అయితే ఇంతవరకు ఒక్కసారి కూడా కప్పు గెలవలేకపోయిన కోహ్లీ టీం ఆర్సీఐబి ఈ సారి కప్పు కొట్టాలని దృఢ నిశ్చయంతో ఉంది..
అయితే ఈ సారి కప్పు కొట్టాలంటే కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాట్ ఝుళిపించాల్సి ఉందని ఆసీస్ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా తన సహజసిద్ధమైన ఆటను ఆడాలని కోహ్లికి సూచించాడు. కోహ్లికి ఒత్తిడి తగ్గిస్తేనే అది ఆర్సీబీకి ఉపయోగడపడుతుందని పేర్కొన్న బ్రెట్ లీ.. ఫించ్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెబుతారని అనుకుంటున్నానని అన్నాడు.
తొలిసారి ఆర్సీబీ తరఫున ఆడబోతున్న ఫించ్.. కోహ్లికి సాయంగా ఉంటాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. కోహ్లి తర్వాత వైస్ కెప్టెన్సీ రోల్ ఫించ్దేనని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు. ఆర్సీబీ సక్సెస్ బాటలో పయనించాలంటే కోహ్లికి ఒత్తిడి తగ్గించాల్సిందేనని లీ తెలిపాడు.
కోహ్లి కేవలం క్రికెట్ను ఆస్వాదిస్తూనే బ్యాటింగ్ చేయాలి. ఎటువంటి ఒత్తిడి తీసుకోకూడదు. ఒక ప్లేయర్గా ఒక కెప్టెన్గా సక్సెస్ కావాలంటే ఒత్తిడిని వదిలేయాలి. ప్రస్తుతం కోహ్లి ఎంతో ఎత్తులో ఉన్నాడు. ఒక్కోసారి జట్టులో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆటగాళ్లు విఫమైనప్పుడు ఆ భారాన్ని కెప్టెన్ మోయాల్సి ఉంటుంది.
ఇక్కడ కోహ్లి ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆసీస్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ అయిన అరోన్ ఫించ్ అనుభవం కోహ్లికి ఉపయోగపడుతుంది. ఫించ్ వైస్ కెప్టెన్గా ఉంటే కోహ్లి ఒత్తిడి తగ్గుతుంది’ అని స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన క్రికెట్ కనెక్టడ్ షోలో బ్రెట్ లీ పేర్కొన్నాడు. గతంలో పలు ఫ్రాంచైజీలకు ఐపీఎల్లో ఫించ్ ప్రాతినిథ్యం వహించగా, ఈ సీజన్ ఐపీఎల్గాను గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసింది.