కాకతీయ తోరణం తెలంగాణ అస్తిత్వం...బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు
By: Sankar Tue, 22 Dec 2020 9:19 PM
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్కు ఫిట్స్ వచ్చాయని బీజేపీ సీనియర్నేత, మధ్యప్రదేశ్ బీజేపీ ఇంచార్జ్ మురళీధర్రావు అన్నారు.
ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల జిమ్మిక్కులు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 7 తర్వాత వరద సాయం ఇస్తామని ఇప్పటికీ ఎందుకు అందజేయలేదని ప్రశ్నించారు. వరంగల్లో ప్రజలు వర్షాలతో నష్టపోయినా వారికి రూ.10వేలు ఇవ్వలేదని మండిపడ్డారు.
కరోనాతో ప్రైవేట్ స్కూళ్లల్లో పనిచేస్తున్న 6 లక్షలమంది రోడ్డునపడ్డారని దుయ్యబాట్టారు. ప్రైవేట్ పాఠశాలపై పరోక్షంగా ఆధారపడిన వారికి ఉపాధి పోయిందన్నారు. చార్మినార్ తెలంగాణకు బాసింగం కాదని, కాకతీయ తోరణం తెలంగాణ అస్తిత్వమని తెలిపారు. కాకతీయులు ఫ్యూడలిజం ప్రవేశపెట్టలేదని, గొలుసు చెరువులతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు..