బీజేపీ సీనియర్ నేత ఉమాభారతికి కరోనా పాజిటివ్
By: Sankar Sun, 27 Sept 2020 11:04 AM
కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వైరస్ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఈ వైరస్ సోకుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. అటు కొంత మంది కీలక పదవిలో ఉన్న నాయకులు ఈ వైరస్ సోకి మృతి చెందారు.
అయితే.. తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, సీనియర్ పార్టీ నేత ఉమాభారతికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఉమా భారతి తన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తనకు కరోనా వచ్చిందన్నారు. "గత మూడు రోజులుగా కొద్దిపాటి జ్వరం ఉంది...ఎందుకైనా మంచిదని టెస్ట్ చేయించుకున్నాను. ఆ తర్వాత వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్ తేలింది.
గత కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్ అయిన వారంతా వెంటనే పరీక్షలు చేయించుకోండి. టెస్టులు పూర్తయ్యే వరకూ ఎవరినీ కలవకుండా క్వారంటైన్ లో ఉండటం మంచిది" అని ఉమాభారతి పేర్కొన్నారు. ఉమా భారతికి కరోనా సోకడంపై బీజేపీ నేతలు విచారం వ్యక్తం చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు.