Advertisement

  • ప్రచార సభల్లో తండ్రిని మించి సరికొత్త రికార్డు సృష్టించిన తేజస్వి యాదవ్

ప్రచార సభల్లో తండ్రిని మించి సరికొత్త రికార్డు సృష్టించిన తేజస్వి యాదవ్

By: Sankar Mon, 02 Nov 2020 2:00 PM

ప్రచార సభల్లో తండ్రిని మించి సరికొత్త రికార్డు సృష్టించిన తేజస్వి యాదవ్


బీహార్‌లో రెండో దశ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం 5 గంటలతో తెరపడింది. అయితే, మహాకూటమి సీఎం అభ్యర్థి, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జీడీ) నేత తేజస్వీ యాదవ్ మెరుపు వేగంతో ప్రచారం నిర్వహించి కొత్త రికార్డులు నెలకొల్పారు.

కేవలం ఒక్క రోజులోనే 19 చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించి భారత రాజకీయాల్లో ఓ కొత్త రికార్డ్ సృష్టించారు. అంతేకాదు, తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పేరిట ఉన్న రికార్డును తనయుడు అధిగమించడం విశేషం. లాలూ ప్రసాద్ యాదవ్ ఒక్క రోజు 16 చోట్ల ప్రచార సభల్లో పాల్గొన్నారు.

గతంలో ఏ రాజకీయ నేత ఒక్క రోజు ఇన్నిచోట్ల ప్రచారం నిర్వహించలేదు. తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టిన తేజస్వీ.. ఒక్క రోజులో ఏకంగా 17 ర్యాలీలు, 2 రోడ్డు షోలు నిర్వహించారు. వేర్వేరు జిల్లాల్లోని ప్రచార సభల్లో తేజస్వీ పాల్గొనడం విశేషం. తేజస్వీ యాదవ్ శనివారం ఉదయం 10.05 గంటలకు సీతామర్హి నుంచి ర్యాలీ ప్రారంభించి, వైశాలి జిల్లాల్లోని బిదూపూర్ బ్లాక్‌లో సాయంత్రం 4.45 గంటలకు చివరి ర్యాలీ నిర్వహించారు. ఈ మధ్యలో మొత్తం 17 ర్యాలీలు, 2 రోడ్డు షోలు నిర్వహించారు.

Tags :

Advertisement