రామాలయం భూమి పూజ కోసం అయోధ్య సిద్ధం...ముస్లింలు హాజరయ్యేందుకు అనుమతి
By: chandrasekar Tue, 28 July 2020 1:42 PM
రామాలయం భూమి పూజ కోసం
అయోధ్య సిద్ధమవుతుండగా ఈ కార్యక్రమాన్ని ముస్లిం భక్తులు వేడుకగా నిర్వహించేందుకు తయారవుతున్నారు. ఆలయ
నిర్మాణ పనులు ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతాయని ఎదురుచూస్తున్నామంటున్నారు పలువురు
ముస్లిం భక్తులు. వచ్చే నెల ఐదో తేదీన భూమిపూజ జరిపేందుకు రామాలయ తీర్థ ట్రస్ట్
అన్ని సిద్ధం చేసింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమిపూజ జరిపేందుకు ముహూర్తం
నిశ్చయించారు.
ఈ భూమిపూజ కార్యక్రమంలో
పాల్గొనేందుకు అయోధ్యతోపాటు పలు ప్రాంతాల నుంచి ముస్లింలు హాజరయ్యేందుకు ఇప్పటికే
అనుమతి తీసుకున్నారు. ఫైజాబాద్ జిల్లా నివాసి జంషెడ్ ఖాన్ పలువురు హిందువులతో
కలిసి ఆలయ నిర్మాణ ప్రారంభాన్ని వేడుకగా జరుపుకుంటానంటున్నారు. “మేము ఇస్లాం
మతంలోకి మారి అక్కడి ప్రార్థన విధానాన్ని స్వీకరించాం. కానీ, అది మా
పూర్వీకులను మార్చదు. శ్రీరాముడు మా పూర్వీకుడు అని మేం నమ్ముతున్నాం” అని జంషెడ్
ఖాన్ చెప్పారు.
పవిత్ర పట్టణంలో జరిగే
వేడుకల్లో పాల్గొనడానికి రాముడి ముస్లిం భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి అయోధ్యకు
వస్తున్నారని ముస్లిం రాష్ట్రీయ మంచ్ అవధ్ ప్రావిన్స్ ఇంచార్జ్ అనిల్ సింగ్
పేర్కొన్నారు. "భక్తులలో ఒకరు ఆలయ నిర్మాణం కోసం తన సొంత రాష్ట్రం ఛత్తీస్గఢ్
నుంచి ఇటుకలు తీసుకుని అయోధ్యకు వస్తున్నారు" అని ఆయన చెప్పారు.
భారతీయ ముస్లింలు
శ్రీరాముడిని ‘ఇమామ్-ఇ-హింద్’ గా భావిస్తారని హాజీ సయీద్ అన్నారు. రామ జన్మభూమి
వద్దకు ప్రవేశించే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నానని రషీద్ అన్సారీ తెలిపారు.
"భద్రత, ఇతర కారణాల వల్ల నాకు అక్కడికి వెళ్ళే అవకాశం
రాకపోతే.. నేను అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభించినట్లు వేడుక
జరుపుకుంటాను" అని చెప్పారు.
ఫైజాబాద్కు చెందిన వాసి
హైదర్ కూడా ఇలాంటి మనోభావాలను ప్రతిధ్వనించాడు. "మేము ఇస్లాం యొక్క ప్రాథమికాలను
విశ్వసిస్తున్నాము మరియు మేము ఇస్లాంను ఆచరిస్తాము, కాని రాముడు మన
పూర్వీకుడు అని కూడా మేము నమ్ముతున్నాము. రామాలయ
నిర్మాణానికి మేము సాక్ష్యమివ్వడం చాలా గొప్పగా ఉంటుంది, ”అని
అన్నారు.
కరోనా వైరస్ మహమ్మారి
నేపథ్యంలో ఈ కార్యక్రమంలో 200 మంది వరకు పరిమితంగా హాజరవుతారని మిశ్రా తెలిపారు.
రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించే వేడుక కోసం ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యను
సందర్శించే అవకాశం ఉందని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు
తెలిపారు. దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్న ‘భూమి పూజన్’ వేడుకకు ఆహ్వానించిన
వారిలో ప్రముఖ బీజేపీ నాయకులు ఎల్ కే అద్వానీ, ఎం ఎం జోషి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు ఉన్నారు అని
ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. వివిధ ఆధ్యాత్మిక నాయకులను
ఆహ్వానించడానికి ప్రణాళిక కూడా ఉన్నదని ఆయన అన్నారు.