ఏపీలో కొత్తగా 379 కరోనా పాజిటివ్ కేసులు
By: Sankar Wed, 23 Dec 2020 7:12 PM
ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 57,716 నమూనాలు పరీక్షించగా 379పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో మొత్తం కేసుల సంఖ్య8,79,718కు చేరింది. కొత్తగా ముగ్గురు కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య7,085 కి చేరింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఇక గడిచిన 24 గంటల్లో 490 మంది కోవిడ్ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,864 యాక్టివ్ కేసులు ఉన్నాయి.జిల్లాల వారీగా చూసుకుంటే కృష్ణ జిల్లాలో అత్యధికంగా 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, ఇక ఆ తర్వాత చిత్తూరు లో 64, గుంటూరు లో 46, ఈస్ట్ గోదావరి లో 35 , కడపలో 44 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి
Tags :
ap |
reports |
373 |