- హోమ్›
- వార్తలు›
- ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీ ఫ్యాక్టరీలో 500వ మెట్రో కారును విజయవంతంగా ఉత్పత్తి చేసిన ఆల్స్టోమ్
ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీ ఫ్యాక్టరీలో 500వ మెట్రో కారును విజయవంతంగా ఉత్పత్తి చేసిన ఆల్స్టోమ్
By: chandrasekar Wed, 11 Nov 2020 10:06 AM
ఆంధ్రప్రదేశ్లోని
శ్రీసిటీ ఫ్యాక్టరీలో ఆల్స్టోమ్ 500వ
మెట్రో కారును విజయవంతంగా ఉత్పత్తి చేసింది. స్మార్ట్ మొబిలిటీలో అగ్రస్థానంలో
కొనసాగుతున్ ఆల్స్టోమ్ మరొక మైలురాయిని చేరుకున్నది. అర్బన్ మెట్రో ప్రాజెక్టుల
కోసం రోలింగ్ స్టాక్ 'మెట్రో ట్రైన్లు' ను తయారుచేసే ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీ ఫ్యాక్టరీ
తన 500వ
మెట్రో కారు ఉత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అతి
పెద్ద అర్బన్ రోలింగ్ స్టాక్ తయారీ కేంద్రంగా, ఇక్కడి పరిశ్రమ భారతీయ నగరాలతో పాటు ప్రపంచ
వ్యాప్తంగా ఉన్న నగరాలైన - చెన్నై, కొచ్చి, లక్నో, ముంబై, సిడ్నీ, మాంట్రియల్లకు
కూడా మెట్రో ట్రైన్ సెట్లను పంపిణీ చేస్తున్నది. ప్రస్తుతం ఇక్కడి పరిశ్రమలో
తయారైన మెట్రో రైళ్లు 27 మిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయి. అత్యాధునిక
ఉత్పాదక ప్రమాణాలకు గుర్తింపు దక్కించుకున్న ఆల్స్టోమ్ శ్రీసిటీ పరిశ్రమ చెన్నై
మెట్రో కోసం తన కార్యకలాపాలను సెప్టెంబర్ 2012లో ప్రారంభించింది. ఇప్పటి వరకు, ఈ సైట్లో 2 మిలియన్ ఉత్పాదన గంటలు పూర్తయ్యాయి, ఏటా 480
మెట్రో కార్ల నిర్మాణ సామర్థ్యాన్నికలిగి ఉంది. మంచి నాణ్యతతో అవసరాలకు తగ్గట్టు
మెట్రో కారును అందిస్తూ వుంది.
కరోనా వల్ల భారతదేశంలో
అన్లాక్ 1.0 ప్రకటించిన అనంతరం, ఈ సైట్ కెనడాలోని నగరమైన
మాంట్రియల్ - రిసో ఎక్స్ప్రెస్
మెట్రోపాలిటన్ కోసం రెండు ట్రైన్ సెట్లతో మొదటి బ్యాచ్ను విజయవంతంగా పంపించింది.
ఆల్స్టోమ్ ఇండియా,దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ అలైన్ స్ఫోర్
మాట్లాడుతూ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అన్నిపరిశ్రమల్లో ఉత్పాదకతకు అంతరాయం
కలిగించినప్పటికీ, మా బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తూ, మెట్రో
కార్పొరేషన్లకు కావలసిన ఉత్పత్తులను సకాలంలో అందిస్తూ, వివిధ
నగరాల్లో అర్బన్ మొబిలిటీని ఉన్నతీకరిస్తున్నాము. ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని
అందించేలా, అత్యధిక భద్రత ప్రమాణాలను కలిగిన ట్రైయిన్ సెట్లను
మేము తయారు చేస్తున్నాము. మేక్-ఇన్-ఇండియాకు అనుగుణంగా, మా
నిబద్ధతను కొనసాగిస్తున్నాము, అన్ని దేశీయ ప్రాజెక్టులలో లోకలైజేషన్ 75శాతం
పైగా ఉందని వివరించారు. ఇది గొప్ప మైలు
రాయిగా గుర్తించారు.