ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యారాయ్
By: chandrasekar Sat, 18 July 2020 7:51 PM
అందాల సుందరి ఐశ్వర్యారాయ్ ఆస్పత్రిలో చేరారు. ఐశ్యర్వతో పాటు ఆమె కుమార్తె ఆరాధ్యను కూడా శుక్రవారం రాత్రి ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్పించారు.
కరోనా వైరస్ బారిన పడిన ఐశ్వర్యారాయ్, ఆరాధ్య ముంబైలోని తన నివాసంలో హోమ్ క్వారంటైన్లో
ఉన్న విషయం తెలిసిందే. ఐశ్యర్యారాయ్ భర్త అభిషేక్ బచ్చన్, మామ అమితాబ్ బచ్చన్ కూడా అదే ఆస్పత్రిలో కరోనాకు
చికిత్స పొందుతున్నారు.
అమితాబ్ బచ్చన్కు కరోనా
వైరస్ సోకడంతో కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించగా అభిషేక్, ఐశ్వర్యతో పాటు ఆరాధ్యకు పాజిటివ్గా తేలిన విషయం
తెలిసిందే. ఐశ్వర్యకు తొలిసారి చేసిన పరీక్షలో నెగటివ్గా తేలగా జులై 12న రెండోసారి నిర్వహించిన పరీక్షలో పాజిటివ్గా
నిర్ధారణ అయింది. కుమార్తె ఆరాధ్యకు కూడా పాజిటివ్గా తేలింది. నాటి నుంచి
తల్లీకూతుళ్లు గృహ నిర్భందంలో ఉన్నారు. 46 ఏళ్ల ఐశ్వర్యారాయ్కి కొవిడ్ పాజిటివ్గా
తేలినప్పటికీ ఎలాంటి లక్షణాలు బయటపడలేదు.
శుక్రవారం కొద్దిగా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేరినట్లు నానావతి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆమెకు చికిత్స
అందిస్తున్నట్లు వెల్లడించాయి. ఐశ్వర్యారాయ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలియగానే
అభిమానులు
ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ ట్వీట్లు
చేస్తున్నారు.