Advertisement

  • కర్నూలు లో కొనసాగుతున్న వజ్రాల వేట..కూలికి దొరికిన 4 కారెట్ల వజ్రం

కర్నూలు లో కొనసాగుతున్న వజ్రాల వేట..కూలికి దొరికిన 4 కారెట్ల వజ్రం

By: Sankar Sat, 26 Sept 2020 4:59 PM

కర్నూలు లో కొనసాగుతున్న వజ్రాల వేట..కూలికి దొరికిన 4 కారెట్ల వజ్రం


కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది. తొలికరి తర్వాత వర్షాలు కురుస్తుండటంతో స్థానికులంతా వజ్రాల వేటలో బిజీ అయ్యారు. ఒక్క వజ్రం దొరికితే చాలు లక్షాదికారి అవ్వొచ్చనే ఆశతో గాలింపు చేపడుతున్నారు.

ఈ క్రమంలోనే కొందరికి వజ్రాలు దొరికాయి. తాజాగా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఓ కూలీకి వజ్రం దొరికింది. పొలం పనులు చేస్తున్న సమయంలోవజ్రం లభించింది. రూ. 1.5 లక్షలకు ఓ వ్యాపారి ఆ వజ్రాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. నాలుగు నెలల కాలంలో చాలామందికి వజ్రాలు దొరికాయి.

ప్రతి ఏటా తొలకరి తర్వాత అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వజ్రాల వేట ప్రారంభమవుతుంది. స్థానికులు పొలాల్లో వజ్రాల వేటలో బిజీ అవుతున్నారు. ఇటీవల అనంతపురం జిల్లాలో కూడా ఖరీదైన వజ్రం దొరకగా.. ఓ వ్యాపారికి అమ్మినట్లు తేలింది. పోలీసులు కూడా ఈ వ్యవహారంపై ఆరా తీశారు.

కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లోని జొన్నగిరి, ఎర్రగుడి, పెరవలి, గిరిగెట్ల, తుగ్గలి, మద్దికెర, అగ్రహారం, పగిడిరాయి, రాతన కొత్తూరు, బసినేపల్లి, గిరిగెట్ల, అమినాబాద్, రాతన గ్రామాలు వజ్రాల కారణంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆ గ్రామాల భూముల్లో ఏటా వర్షాకాలంలో వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి.

Tags :

Advertisement