Advertisement

  • టీటీడీ లో ఇప్పటివరకు 743 మందికి కరోనా ..ఈవో సింఘాల్

టీటీడీ లో ఇప్పటివరకు 743 మందికి కరోనా ..ఈవో సింఘాల్

By: Sankar Sun, 09 Aug 2020 3:42 PM

టీటీడీ లో ఇప్పటివరకు 743 మందికి కరోనా ..ఈవో సింఘాల్



తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఇప్పటి వరకు 743 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియాతో సింఘాల్ మాట్లాడుతూ..

టీటీడీ ఉద్యోగుల్లో ఇప్పటి వరకు 743 మందికి కరోనా సోకిందని, వీరిలో దాదాపు 400 మంది మహమ్మారిని జయించి నగరంలోని పలు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు. ఇంకా కోవిడ్ కేంద్రాల్లో 338 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. అలాగే కోవిడ్‌తో ఐదుగురు టీటీడీ ఉద్యోగులు మృతి చెందారని చెప్పారు.

అలాగే గత జూలైలో హుండీ ఆదాయం రూ. 16 కోట్లు రాగా.. ఈ-హుండీ ద్వారా రూ. 3 కోట్ల ఆదాయం వచ్చిందని ఈవో సింఘాల్ వెల్లడించారు. టీటీడీ వార్షిక బడ్జెట్ రూ. 3,200 కోట్లు కాగా, ఇందులో రూ. 1,350 కోట్లు కేవలం జీతాలకే ఖర్చు అవుతుందన్నారు. ఖర్చులు ఎంత తగ్గించుకున్నా ప్రస్తుతం నెలకు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఖర్చు అవుతోందన్నారు. ఇప్పటి వరకు కార్పస్ ఫండ్ నుంచి ఎలాంటి నిధులు తీసుకోవటం లేదని వెల్లడించారు. భవిష్యత్తులో టీటీడీ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.


Tags :
|
|
|
|

Advertisement