324 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్...!
By: Anji Wed, 16 Dec 2020 4:35 PM
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పరిధిలోని జైభవాని నగర్లో రైతుబజార్ వద్ద నిర్మించిన 324 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు కేటీఆర్, ప్రారంభించారు.
రెండు ఎకరాల విస్తీర్ణంలో 3 బ్లాక్లుగా 9 అంతస్తుల్లో ఈ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల ఘనత సీఎం కేసీఆర్దేనని… పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే విధంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి భవనాలు పేదలకు నిర్మించి ఇవ్వలేదన్నారు.
వనస్థలిపురంలో ఇదే ఇల్లు కొనుగోలు చేయాలంటే రూ. 40-50 లక్షలు అవుతందని పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఇంకా చాలా పథకాలు తీసుకువస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్లేశం, మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.